31-05-2025 10:43:12 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): వచ్చే సోమవారం నాటికి ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2 (సోమవారం) కి ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా దరఖాస్తులు సమర్పించదలచిన వారు కలెక్టరేట్లోని రూం నెంబర్ 25 లో సమర్పించవచ్చని తెలిపారు. జూన్ 9న జరిగే ప్రజావాణి కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.