24-06-2025 12:00:00 AM
జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, జులై 23 (విజయ క్రాంతి) జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో భూ భారతి తరపున 100 అర్జీలు రావడం జరిగింది వీటిని వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్విన్ భాషా షేక్, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది.
మరియు ఈ ప్రజావాణిలో భాగంగా 74 అర్జీలు రావడం జరిగింది నరవాడ మండలం సూర్య బండ తండాకు చెందిన అనిత, తమకు ఇల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది జనగామ మున్సిపాలిటీ పరిధిలోని హనుమకొండ రహదారిలో సర్వేనెంబర్ 56 వెంచర్ పై ఉన్న కోర్టు కేసు కొట్టేశారని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు తమకు అనుమతి ఇవ్వాలని పట్టాదారు.
వీరారెడ్డి కలెక్టర్ ను విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్టి ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవోలు గోపి రామ్, హనుమంతు నాయక్, డి ఆర్ డి ఓ వసంత, డి హెచ్ ఎస్ ఓ శ్రీధర్, డి పిఆర్ఓ శ్రీనివాస్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.