calender_icon.png 30 June, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం సమస్యలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులు

09-06-2025 12:21:39 AM

  1. కరకట్ట పనులు వేగంగా పూర్తి చేయాలి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భద్రాచలం, జూన్ 8 (విజయ క్రాంతి)భద్రాచలం సమస్యలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులైన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు.భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న కరకట్ట పనుల జాప్యం తో మరోసారి భద్రాచలం పట్టణ ప్రజలకు ముంపుభయం పట్టుకున్నదని.

వెంటనే కరకట్ట పనులకు కావలసిన నిధులను కేటాయించి పనులను వేగవంతం చేయడంతో పాటు పట్టణ వ్యాప్తంగా ఉన్న స్లూ ఈస్ ల మరమ్మతులు చేపట్టి భద్రాచలం పట్టణాన్ని గోదారి ముంపు నుండి కాపాడాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ పట్టణ కమిటీ సమావేశానికి మచ్చ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరటం లేదని ప్రతి సంక్షేమ పథకంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అత్యంత గందరగోళంగా తయారైందని అధికారులు ప్రకటించిన పేర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న పేర్లకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని ఎవరిష్టం వచ్చినట్టు వారు లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ పార్టీల జోక్యాన్ని సహించేది లేదని అధికారులు చిత్తశుద్ధితో సర్వే నిర్వహించి అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మచ్చ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హడావుడిగా శంకుస్థాపన చేసిన కర్కట పనులను నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తుమ్మల పొంగి రెడ్డి నిధులు మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకోవటం తప్ప ఇష్టంగా కరకట్ట నిర్మాణానికి ఎంత నిధులు అవుతాయో కనీస అంచనా కూడా వేయటం లేదని అన్నారు.

ఇరిగేషన్ అధికారులు అంచనా ప్రకారం కరకట్ట నిర్మాణానికి 100 కోట్లు ఖర్చు అవుతాయని నివేదికిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 30 కోట్ల అంచనా తోనే పనులు చేస్తుందని దాని ఫలితంగా మరోసారి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ కూనవరం రోడ్డు శాంతినగర్ రామాలయ పరిసర ప్రాంతాలు ముంపుకి గురికాక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మంత్రులు జోక్యం చేసుకొని కరకట్ట నిర్మాణానికి కావలసిన విధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

సిపిఐ ఎం ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా స్థానిక సమస్యలపై సర్వే నిర్వహిస్తున్నామని సర్వేల సందర్భంగా వచ్చిన సమస్యలపై దశల వారి ఉద్యమాలకు పార్టీ శ్రీకారం చుడుతుందని అన్నారు.

ఈ సమావేశం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు,సున్నం గంగ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు,పారేలి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి ఉస్తెల జ్యోతి కొలకాని రమేష్ ధనకొండ రాఘవయ్య కుంజా శ్రీనివాస్ కొరాడా శ్రీనివాస్ సండ్ర భూపేంద్ర ఎస్ అజయ్ కుమార్ అంబుజీరత్నం, కనక శ్రీ తదితరులు పాల్గొన్నారు.