09-06-2025 12:20:01 AM
మహబూబాబాద్, జూన్ 8 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు జట్టుగా ఏర్పడి ఇల్లు తిరుగుతూ బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు తమ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ బడిలో చేర్పించాలంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లో ఉపాధ్యాయులు మహమ్మద్ వహీద్, వెంపటి విజయరాజ్, ముత్యాల శ్రీధర్, దైద వెంకటేశ్వర్లు, బొందిలి వెంకన్న, బేత మల్ల ప్రేమ్ సాగర్, బండి రవీందర్, తాళ్లపల్లి యాకమ్మ, ఉప్పలయ్య, ఉమేశ్వర్ ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో కూడిన ప్రచార పత్రాలను ఇంటింటికీ పంచుతున్నారు.