calender_icon.png 28 June, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కరణల పితామహుడు పీవీ!

28-06-2025 01:58:58 AM

  1. ఆయన సంస్కరణల వల్లే 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ 
  2. రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు..
  3. నేడు పీవీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బహుభాషాకోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్క రణల పితామహుడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనూ, అన్నిరంగాల్లో ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత పీవీకే దక్కుతుందని చెప్పారు.

జూన్ 28న పీవీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయన్నారు. విద్యావ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశపెట్టారని, నవోదయ విద్యాలయాలు పీవీ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారని తెలిపారు. పీవీ స్ఫూర్తితోనే రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ప్రతీ నియోజకవర్గంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం సంకల్పించిందన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.