calender_icon.png 28 June, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను జీవో నంబర్ 49ను వ్యతిరేకించాను

28-06-2025 01:56:46 AM

- జీవోకు వ్యతిరేకంగా మొదటి తీర్మానం నేనే చేయించా..

-ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తున్నా..

-మావోయిస్టుల లేఖకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క సమాధానం

ములుగు, జూన్ 27 (విజయక్రాంతి): ‘ఆదివాసీ మంత్రిగా నేను జీవో నంబర్ 49 జీవోను వ్యతిరేకించాను. 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవోకు నేను అనుకూలమని ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచా రంలో వాస్తవం లేదు.

జీవోనే రద్దు చేయాలని తొలుత తీర్మానం చేయించిందే నేను’ అ ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క  స్పష్టం చేశారు. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు రాష్ట్రప్రభుత్వం జీవో నం బర్ 49 విడుదల చేయించిందని, అలాంటి ప్రభుత్వంలో ఆదివాసీ అయిన సీతక్క పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కొనసాగుతుండటం సిగ్గుచేటని, ఆదివాసీల హక్కులను కాపాడాల్సిన బాధ్య త సీతక్కమపై ఉందని గురువారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది.

ఈ లేఖపై శుక్రవారం మంత్రి సీతక్క ములుగు జిల్లాకేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఆదివాసీలకు అన్యాయం జరిగినా స్పందిం చే తొలి ప్రజాప్రతినిధిని తానేనని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సదరు జీవోను వ్యతిరేకిస్తూ తాను ఇప్పటికే అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలు వురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించానని గుర్తుచేశారు.

అటవీశాఖ అధికారులు ఆదివాసీల జోలికి వెళ్లొద్దని సూచించామన్నారు. అత్యుత్సాహం కనబరిచిన వారిని ఎప్పటికప్పుడు మందలిస్తు న్నా మని చెప్పారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్ప, మిగిలిన వారెవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని తేల్చిచెప్పారు. తన గురించి ఎవరు మాట్లాడినా, నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా హితవు పలికారు.