calender_icon.png 28 June, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ ‘ఆదర్శ రైతు’ వ్యవస్థ

28-06-2025 02:01:45 AM

సాగులో అధునాతన పద్ధతులు అవలంబించే వారికి ప్రాధాన్యం

ప్రతి వెయ్యి ఎకరాలకు ఒకరి నియామకం

  1. వారికి సుమారు 20 రకాల బాధ్యతలు అప్పగింత

ఒక్కో రైతుకు రూ.3 వేల గౌరవ వేతనం

త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న సర్కార్ ? 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో అమలైన ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సీఎం రే వంత్‌రెడ్డి ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఈ అం శంపై చర్చ జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సర్కార్ త్వరలోనే మళ్లీ ఆదర్శ రైతులను నియమిం చే అవకాశం కనిపిస్తున్నది.

రాష్ట్ర రైతు కమిషన్ ప్రతి వెయ్యి ఎకరా లకు ఒక ఆదర్శ రైతును నియమించాలని ప్రభుత్వానికి సిఫా ర్సు చేసినట్లు తెలిసింది. 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ఆదర్శ రైతు విధానం అమలైంది. ఈ వ్యవస్థ నాడు వ్యవసాయశాఖకు అనుసంధానంగా పదేళ్ల పా టు పనిచేసింది. సుమా రు 16 వేల మంది ఆదర్శ రైతులు నాడు సేవలందించారు. వీరు నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి రైతులకు సాగుపై సలహాలు, సూచనలిచ్చేవారు.

కారణాలేమైనప్పటికీ.. తెలంగాణ వచ్చిన తర్వాత 2017లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేసింది. దాని స్థానంలో గ్రా మాల్లో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదిక నిర్మించింది. ప్ర స్తుత ప్రభుత్వం రైతువేదికల కేంద్రంగానే వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో రైతులకు సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

ఆ సేవలను మరిం త విస్తృత పరిచేందుకు మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఆదర్శ రైతులను వ్యవసాయ శాఖకు అనుసంధానం చేస్తే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నది. ఆ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మం డలస్థాయిలో ఏవోలు, ఏఈవోలపై పనిభా రం కూ డా కాస్త తగ్గనున్నది.

గతంలో కంటే గౌరవ వేతనం పెంపు..

ఉమ్మడి పాలనలో నాటి ప్రభుత్వం పదోతరగతి ఉత్తీర్ణులై, సాగులో సత్ఫలితాలు సా ధించిన రైతులను ఆదర్శ రైతుగా ఎంపిక చేసింది. నాడు ఒక్కో ఆదర్శ రై తు 250  300 ఎకరాలకు బాధ్యత వహించేవారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం ఇచ్చేది. రా ష్ట్రంలో కొత్తగా నియమితులయ్యే ఒక్కో ఆదర్శ రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలనే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతు న్నది.

ప్రభుత్వం దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. అయితే.. ఆదర్శ రైతులకు గతంలో కంటే మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. వారి సేవలతో వ్యవసాయ రంగం మరింత ప్రగతి సాధిస్తుందని, రైతులకు సాగులో సరైన సూచనలు అందుతాయని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.

పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ

ఆదర్శ రైతుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం చర్య లు తీసుకుంటున్నదని తెలిసింది. పదోతరగతి ఉత్తీర్ణులై సాగులో అత్యాధునిక సాం కేతిక పద్ధతులు, సేంద్రియ, ప్రకృతి సేద్యం అవలంబిస్తున్న రైతులకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. సాగుతోపాటు దాని వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్న వారికి కూడా అవకాశం ఉంటుందని తెలిసింది.

అలాగే డెయిరీ ఫామ్స్, ఫౌల్ట్రీ ఫామ్స్, గొర్రెలు, మేకల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం చేపడుతున్న కొందరు రైతులను సైతం ఎంపిక చేస్తారని సమాచారం. ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతున్నదని ప్రచారం మొదలు కావడంతో ఇప్పటికే ఆశావహులు పైరవీలు ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.