calender_icon.png 9 June, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

08-06-2025 08:05:55 PM

చండూరు (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం(Professor Jayashankar school walk program)లో భాగంగా ఉపాధ్యాయులు ఆదివారం పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. చండూరు, కస్తాల, మెండు వారి గూడెం, వట్టి కోడు, గుండ్రపల్లి గ్రామాలలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలకి తమ పిల్లలను పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మాట్లాడుతూ... గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య గూర్చి తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం గూర్చి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందిస్తూ భోజన సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పందుల యాదయ్య, గంట వెంకటేశం, వెంకటరెడ్డి, సతీష్, రాజు, సుధీర్, సైదులు, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.