08-06-2025 08:01:37 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని బాలికల ఆశ్రమం పాఠశాలలో ప్రవేశాల కోసం ఆదివారం బడిబాట కార్యక్రమంలో ఆదివాసి తండాల్లో నిర్మించి ఆడపిల్లలను పాఠశాలలు అడ్మిషన్ తీసుకున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారం తెలిపారు. మామడ మండలంలోని రాయదారి మొండిగుట్ట తదితర గిరిజన తండాలో గిరిజన పిల్లలను కలిసి ఆశ్రమ గిరిజన పాఠశాలలో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులకు విన్నవించారు.
ఆశ్రమ గిరిజన పాఠశాలలో నాణ్యమైన చదువు పోషక విలువైన ఆహారం ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు స్కూల్ డ్రెస్సులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తల్లిదండ్రులకు భరోసా కల్పించి 20 మందిని అడ్మిషన్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పల్స గజ్జరం వసంతరావు నాందేవ్ తదితరులు ఉన్నారు.