26 June, 2026 | 6:09 PM

Breaking News

రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి

22-10-2024 01:58 AM

మంథని మున్సిపల్ 

చైర్‌పర్సన్ రమాదేవి 

మంథని, అక్టోబర్ 21 (విజయక్రాం తి): మంథని పట్టణంలో చేపట్టిన సీసీరోడ్లను నాణ్యతతో నిర్మించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి సూచించారు. సోమవారం ఆమె పట్టణంలోని బోయినిపేట 6 వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా రోడ్లను నిర్మించాలని, యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆమెవెంట ఏఈ మౌనిక, సూపర్‌వైజర్ వినయ్, నాయకులు రాజు, నరెడ్ల కిరణ్ ఉన్నారు.