01-06-2025 12:00:00 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, సినీమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్లపై విప్లవ చిత్రాల నటుడు ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన స్పందిస్తూ సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.. “ఆర్ నారాయణమూర్తితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది.
పేదల పక్షాన నిలిచే ఆయన అంటే నాకు మొదట్నుంచి ఎంతో గౌరవం. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఆయన వైఖరిలో పెద్ద మార్పు వచ్చింది. వైసీపీ వాళ్లు ఏమి అరాచకాలు చేసినా, సినీ పరిశ్రమకు ఎలాంటి మేలు చేయకపోయినా వారికి వత్తాసు పలుకుతూ వస్తున్న తీరు ఆయనలోని మార్పును ఎవరికైనా ఇట్లే అర్థమయ్యేలా చేస్తోంది.
కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో నారాయణమూర్తి బందీ అయ్యారు
గతంలో అప్పటి సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం మీటింగ్ పెట్టినప్పుడు.. ఆ మీటింగుకు చిరంజీవి, ప్రభాస్ వంటి పలువురు పెద్ద హీరోలు వెళ్లారు. దానికి ఆర్ నారాయణమూర్తి వెళ్లారు. ఆ రోజు చిరంజీవి వంటి పెద్దలను అవమానపరిచిన పుడు నారాయణమూర్తి ఏం మాట్లాడగలిగారు. ఎప్పట్నుంచో డిమాండ్ ఉన్న చిన్న సినిమాకు ఐదో షో ఇప్పించగలిగారా? జగన్, కేసీఆర్ హయాంలలో వారికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు.
‘హరిహరవీరమల్లు’ విడు దల తేదీని ముందుగానే ప్రకటించినప్పుడు, మూడు వారాలు ముందుగా నోటీసు లేకుండా థియేటర్ల బంద్ ఎలా ప్రకటిస్తారు? ఈ విషయం నారాయణమూర్తికి తెలియంది కాదు. ఆయన కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో బందీ అయ్యారు. అందుకే వెనకాముందూ, వాస్తవాలు పట్టించుకోకుండా పవన్కల్యాణ్, దుర్గేశ్లపై విమర్శలు చేస్తున్నారు.
ఆ విషయాలన్నీ బయటపెడతా..
ఏ కార్పొరేట్ శక్తులు ఆయనతో ప్రెస్మీట్ పెట్టించాయో నాకు తెలుసు. నారాయణమూర్తి దీన్ని ఖండిస్తే, ఆ విషయాలన్నీ నేను బయటపెడతాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో థియేటర్ క్యాంటీన్లలో పాప్కార్న్, కూల్డ్రింక్స్ ధరలు, టిక్కెట్ల రేట్ల కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలియంది కాదు. ఆ ప్రభుత్వంలో పోసాని కానీ.. నారాయణమూర్తి కానీ ఏమీ చేయలేకపోయారు.
ఇప్పుడు పవన్కల్యాణ్ ఆ సమస్యల గురించి చరిస్తాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటే ఆయనను విమర్శించడం ఎంతవరకు సమంజసం. రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు.. థియేటర్ల బంద్ బ్రహ్మాస్త్రం వంటిది. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది.
జగన్ చిన్న సినిమాలకు అసలు ఏం చేశారో నారాయణమూర్తి చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నారాయణమూర్తి గుత్తాధిపత్యాన్ని ఎందుకు సమర్దిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయన భావాలు మారడమే ఇందుకు కారణమని అంతా అంటున్నారు.
ఆ నలుగురి వల్లే ఎవరికీ న్యాయం జరగడంలేదు
సమస్యలను తీర్చాల్సింది ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కదా! అది కూడా ఆయనకు తెలీదా? పవన్, దుర్గేశ్లను ఎందుకు టార్గెట్ చేశారు. ఇంకో నిర్మాత.. జనసేన నాయకుడు అంటూ ఓ ఎగ్జిబిటర్ గురించి కామెంట్స్ చేశారు. కావాలనే పార్టీ పేరు తెస్తున్నారు.. ఆ నలుగురు వల్లే ఎవరికీ న్యాయం జరగటంలేదు. ఈరోజుకూ చిన్న సినిమాలకు ఐదో షో రాలేదు.
తెలంగాణలో భారీ రేట్లకు టిక్కె ట్లు, పుడ్ అమ్ముతుంటే ఎందుకు ప్రశ్నించటం లేదు? గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బం దిపెట్టారు.. ఆరోజు ఎందుకు అడగలేదు. నిజమైన ఎగ్జిబిటర్ నష్టపోతుంటే మాట్లాడరు. పని కట్టుకుని కూటమీ ప్రభుత్వాన్ని, పవన్ను విమర్శిస్తున్నారు. ఆరోజు.. ఈ రోజు చిన్న సినిమాలకు సపోర్ట్గా మాట్లాడింది నేనే” అంటూ ముగించారు.