18 July, 2026 | 4:21 PM

Breaking News

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •  

రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి.. అమిత్ షా డిమాండ్

01-07-2024 02:55 PM

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. హిందూ సమాజం అంటే ఒక్క మోడీ కాదు.. హిందూ సమాజం అంటే ఒక్క బీజేపీ, ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సభలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా హిందువులే అని రాహుల్ పేర్కొన్నారు. హింస భావనను ధర్మంతో జోడించడం సరికాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హిందూ భావన తెచ్చిన రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తాన్ని భయకంపితులు చేశారని తెలిపారు. క్షమాపణలు చెప్పాకే రాహుల్ ప్రసంగం కొనసాగించాలని అమిత్ షా డిమాండ్ చేశారు.