02-08-2025 01:23:38 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ వార్షిక న్యాయ సదస్సులో( Annual Legal Conclave) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఎన్నికల వ్యవస్థలో ఏదో తప్పు జరుగుతుందనే అనుమానం ఉందని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో అనుమానం ఉందన్నారు. ఎన్నికల్లో స్వీప్ చేసే విజయాలపై అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ(Rahul Gandhi ) పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో కాంగ్రెస్ ఒక్క సీటు రాలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో లోపాల గురించి మాట్లాడితే సాక్ష్యాలు అడిగారు.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మా కూటమి ఎక్కువ సీట్లు సాధించిందని తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. 4 నెలల వ్యవధిలోనే మహారాష్ట్ర లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని రాహుల్ గాంధీ వివరించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 4 నెలల్లోనే అంత వ్యత్యాసం ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో లోపాలను మహారాష్ట్ర ఎన్నికల్లో గర్తించామని పేర్కొన్నారు. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలు అయ్యాక కొత్తగా కోటి ఓట్లు చేరాయన్నారు. మహారాష్ట్రలో 4 నెలల్లోనే అదనంగా కోటి మందికి ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో కొత్తగా చేరిన ఓట్లలో అధిక బాగం బీజేపీకి వెళ్లాయని చెప్పారు. ఎన్నికల సంగం ఉనికిలో లేదని.. దేశానికి చాటే ఆధారాలు మా వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈసీ కనుమరుగైంది.. ఇది రుజువు చేసేందుకు 6 నెలలు శ్రమించామన్నారు. లోక్ సభ ఎన్నికలను కొల్లగొట్టారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఓట్లు వేసిన 6.5 లక్షల మంది ఓటర్లలో 1.5 లక్షలు నకిలీ ఓట్లే అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.