7 April, 2026 | 11:49 AM

Breaking News

సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •  

పలు జిల్లాల్లో వర్షాలు

29-07-2024 02:40 AM

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): వారం రోజులుగా రాష్ట్రంలో ని పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మో స్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు నిండిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వదులుతున్నారు. పలుచోట్ల చెరువులకు గండ్లు పడటంతో రోడ్లు కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జలాశయ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఆదివారం వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కాగా, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌న గర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములు గు, హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దప లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమ్రంభీం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాత నమోదైనట్టు అధికారులు తెలిపారు. కామారెడ్డి, సంగా రెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం  నమోదైందని వివరించారు.