28-06-2025 12:56:36 AM
ఘట్ కేసర్, జూన్ 27: ఘట్ కేసర్ మున్సిపల్ నూతన కమీషనర్ గా పంజాల రాజేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఘట్ కేసర్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న బి. చంద్రశేఖర్ గుప్తా నగరంలోని సీడీఎంఏ కార్యాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న పంజాల రాజేష్ ఘట్ కేసర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘట్ కేసర్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాలుయాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు కె. నాగరాజు, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, కీసర ఆలయ ధర్మకర్త సామల అమర్, డిసిసి కార్యదర్శి ఆంజనేయులుయాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కవాడి మాధవరెడ్డి, ఖయ్యూం, మల్లేష్ యాదవ్, మేకల సునీల్ కుమార్, గోదా సురేష్ యాదవ్, తదితరులు నూతన కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.