07-08-2025 07:59:36 PM
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలం పల్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సంబరాలను ముందస్తుగా జరుపుకున్నారు. పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు తమ ఇంటి వద్ద నుండి స్వయంగా రాఖీలను తయారు చేసుకుని తీసుకువచ్చారు. విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ విశిష్టతను గురించి హెచ్ఎం దంతుల సురేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సి అర్ పి బాలేరావు గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.