28 August, 2026 | 8:09 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

పరస్పర మైత్రికి రక్షాబంధన్‌.. సంప్రదాయ పరిరక్షణకు జంధ్యాధారణ

28-08-2026 06:22 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): పద్మశాలి సమాజంలో ఐక్యత, పరస్పర మైత్రి, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రక్షాబంధన్‌, జంధ్యాధారణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంజూర్ నగర్‌లోని 1000 క్వార్టర్స్‌లో ఉన్న శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో పద్మశాలి జిల్లా సంఘం, శ్రీ భార్గవ పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ... జంధ్యాధారణకు హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉందని అన్నారు. ఆధునికత పేరుతో మన మూలాలను మరచిపోకుండా ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉంటూ కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భీమనాధుని సత్యనారాయణ, షేర్‌ కుమారస్వామి, పల్ల రాజేశం, కందగట్ల రవిందర్, నాగుల మహేందర్, కోడూరి సుదాకర్, దాసరి సుదర్శన్, అందేం నర్సింగం, గుండేటి నర్సయ్య, చిప్ప సాయిరాం, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.