27 August, 2026 | 2:58 PM

ఖాకీకి రాఖీ బంధం.. మంథని పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు

27-08-2026 02:28 PM

ఎస్ఐ సందీప్ కుమార్ కు రాఖీ కట్టిన మహిళా కానిస్టేబుళ్లు 

మంథని, ఆగస్టు 27 (విజయక్రాంతి): అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని గురువారం మంథని పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ మంథని ఎస్ఐ సందీప్ కుమార్‌కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఖాకీ విధుల్లో నిత్యం ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసు కుటుంబంలో రక్షాబంధన్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా కానిస్టేబుల్ ప్రేమాభిమానాలకు ప్రతీకగా రాఖీ కట్టగా, ఎస్ఐ సందీప్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోదరభావాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లయ్య గౌడ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఒకే కుటుంబంలా పనిచేస్తున్న పోలీసు సిబ్బంది రక్షాబంధన్ వేడుకలను కలిసి జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని, పోలీసు కుటుంబంలో పరస్పర ఆప్యాయత, సోదరభావం మరింత బలపడాలనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. మంథని పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ రాఖీ వేడుకలు ఆప్యాయత, అనుబంధాల మధ్య సందడిగా సాగాయి.