13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మల్లారెడ్డిని కలిసిన రాంచందర్‌రావు

16-02-2026 01:32 AM

చైర్‌పర్సన్ల ఎన్నికపై చర్చ!

మేడ్చల్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదివారం రాత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిశారు. మల్లారెడ్డి తన విద్యాసంస్థ ఆవరణలో శివరాత్రి పర్వదినం సందర్భంగా హోమం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును ఆహ్వానించారు. రాంచందర్‌రావు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చు కున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాంచందర్‌రావు మల్లారెడ్డిని కలవడం గుమనార్హం. వీరి మధ్య చైర్‌పర్సన్ల ఎన్నిక విషయమై చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. సోమవారం జరిగే చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారా, బీఆర్‌ఎస్‌కు అను కూలంగా వ్యవహరిస్తారా, తటస్థంగా ఉంటా రా అనేది సస్పెన్స్ నెలకొంది.