22 June, 2026 | 2:23 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

రామడుగు ఎస్సైతో ప్రాణహాని

11-07-2024 12:19 AM

రక్షణ కల్పించాలని దంపతుల వేడుకోలు

కరీంనగర్ సిటీ, జూలై 10: రామడుగు ఎస్సై మామిడాల సురేందర్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని దంపతులు కుతాడి కనుకయ్య, కుతాడి అనిత వేడుకున్నా రు. బుధవారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. దొంగతనం కేసులో తమను అన్యాయంగా ఇరికించి, నేరాన్ని ఒప్పుకో మంటూ చిత్రహింసలకు గురి చేశాడ ని దంపతులు ఆరోపించారు. ఎస్సై మామిడాల సురేందర్‌పై చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాల ని, తమకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారివెంట కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి నాగరాణి, పుష్పలత, రాణి ఉన్నారు.