calender_icon.png 23 October, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప అద్భుతమైన కట్టడం

23-10-2025 01:53:32 AM

పంజాబ్, యూపీ ఈఆర్సీ చైర్మన్ విశ్వజిత్ ఖన్నా, అరవింద్ కుమార్

వెంకటాపూర్(రామప్ప), అక్టోబర్22, (విజయక్రాంతి): కాకతీయుల కళా సంపదను వీక్షంచడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ విశ్వజిత్ ఖన్నా దంపతులు, అరవింద్ కుమార్ దంపతులు సందర్శించారు.

ఈ సందర్బంగా వారికి ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమా శం కర్ లు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిళ్పకళ ప్రాముఖ్యత, చరిత్ర గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. దేవా లయ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు రామప్ప దేవాలయ శిల్పకళ, నిర్మాణ శైలి చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం వారు దేవాలయ సౌందర్యాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి ప్రాచీన కళా సంపదను సంరక్షించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.

అలాగే స్థానిక అధికారుల కృషిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు అలనాటి వైభవాన్ని కళాత్మక శిల్పాలతో కళ్లకు కట్టినట్లు నిర్మించారని, ఈ అద్భుత కట్టడానికి యునెస్కో గౌరవం దక్కడం అదృష్టమని కొనియాడారు. రాతిపై చెక్కిన ఇక్కడి శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోందని, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, సాంకేతిక పరిజ్ఞానం ఇతిహాసాలు చరిత్ర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని, జీవకళ ఉట్టిపడే ఇక్కడి శిల్పకళాకృతుల సౌందర్యానికి మంత్రముగ్ధులు కావాల్సిందే అని కితాబు ఇచ్చారు.

రాతి స్తంభాలకు స న్నని ధారం, వెంట్రుక పట్టే రంధ్రాలు ఉండటం విశేషమని, ఆలయం అంతా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామశింగేశ్వరుడి వద్ద వెలుతురు ఉందని అన్నారు. రామప్ప సరస్సులో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఈ రాక్ భాస్కర్, ఏఎస్ కళ్యాణ్, డిఈ కన్స్ట్రక్షన్ ఎం ఆర్ టి సదానందం, ఎడిఈ ఆపరేషన్ ములుగు వేణుగోపాల్, వెంకటాపూర్ సబ్ ఇంజనీర్ సాంబరాజు మరియు స్థానిక విద్యుత్ సిబ్బందిలు తదితరులు పాల్గొన్నారు.