పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు
06-01-2026 09:07 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు సంస్కృతిక విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి మాట్లాడుతూ... సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు రంగోలి పోటీలను నిర్వహించామని, ఇవి వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని, విద్యార్థులు సంక్రాంతి పండుగను, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగు రంగుల ముగ్గులు వేసి రంగోలి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. అనంతరం అత్యుత్తమమైన రంగోలి ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులను ప్రకటించారు.






