04-06-2025 12:41:57 AM
గ్యాలంట్రీ అవార్డుకు ఎంపిక
అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
వాజేడు, (విజయక్రాంతి): ములుగు ప్రతినిధి: వృత్తిలో ఉత్తమ సేవలందించినం దుకు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ మెడల్ గ్యాలంట్రీ అవార్డును అందుకు న్నారు.
హన్మకొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన గుర్రం భాగ్యలక్ష్మి సుదర్శన్ గౌడ్ పుణ్య దంపతులకు ద్వితీయ కుమారుడిగా జన్మించిన గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి..తాను కోరుకున్న ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించి.. మొ దటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీ స్ స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధుల్లో చేరాడు.
ఏటూర్ నాగారం కు బదిలీపై వెళ్లి విధులు నిర్వహిస్తూ.. పేరూర్ పోలీస్ స్టేషన్ కు బదిలై ప్రస్తుతం అక్కడ విధులను నిర్వహిస్తున్నారు. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు ఏనలేని సేవలను అందిస్తున్న గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకు పోలీస్ మెడల్ గ్యాలంట్రీ అవార్డును అందించారు.