బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సాయి కృపా నగర్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన ఆదిత్య పాఠశాల పై విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించి విద్యాశాఖ నుండి అనుమతి పొందడం జరిగిందని, విద్యార్థి సంఘాల దృష్టికి రావడం జరిగింది.
కావున ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పత్రాలను అధికారులు మళ్లీ ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విద్యార్థి సంఘాల తరఫున అధికారులను డిమాండ్ చేశారు. విచారణ చేసిన అనంతరం పూర్తి నివేదిక ఉన్నత అధికారులకు అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జీవన్ రాథోడ్, బీసీ విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, రాఘవేంద్ర పాల్గొనడం జరిగింది.






