calender_icon.png 18 October, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావేరి ఆసుపత్రిలో నవజాత శిశువులకు అరుదైన వైద్యం

18-10-2025 12:00:00 AM

నిర్మల్ రూలర్, అక్టోబర్ 17: నిర్మల్ పట్టణంలోని కావేరి చిల్డ్రన్ హాస్పిటల్ లో  ఐదుగురు నవజాత శిష్యులకు అరుదైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడినట్టు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చక్రధరి శ్రీకాంత్ లు తెలిపారు. రెండు నెలల క్రితం తమ హాస్పిటల్‌కు సోనాలకు చెందిన రచన మస్కాపూర్‌కు చెందిన లలిత వడ్డీలకు చెందిన సీతం నవజాత శిశువులను తీసుకురావడం జరిగిందన్నారు.

ముగ్గురు శిశువు లు తక్కువ బరువుతో ఉండి వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా వారికి అరుగుదైన వైద్యం అందించడం  ద్వారా ప్రాణాలు కాపాడాలని వారి కుటుం బ సభ్యులు ప్రాధేయపడినట్లు తెలిపారు దీంతో నిర్మల్ ,స్థానిక కావేరి పిల్లల హాస్పిటల్ లోని అత్యాధునిక, హెపాఫిల్టర్స్ ఉన్న మాడ్యులర్ ఎన్‌ఐసీయూలో చేర్చామన్నా రు.

వీరు సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డా. అప్పాల చక్రధారి, పిల్లల వైద్య నిపుణులు డా. కావేటి శ్రీకాంత్, పిల్లల వైద్య నిపుణురాలు డా. కావేటి నాగరంజని, ఇద్దరు డీఎంఓలు, అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలతో చికిత్స అందించామని, అతి తక్కువ బరువు మరియు నెలలు నిండని కారణంగా ఎదురైన ఎన్నో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొ న్న వారి ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక వైద్యం చేశామన్నారు. అత్యాధునిక పరికరాలు, వెంటిలేటర్, HFO,HFNC, Surfactant therapy మరియు లాబ్ టెస్టుల సహాయంతో పరిష్కరించామని, వారి ఆరోగ్యం మెరుగుపడి శిశువులనందరిని 1.5 kg బరువు పెరగడంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి 45 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశామన్నారు.