01-01-2026 02:16:55 AM
జహీరాబాద్ టౌన్, డిసెంబర్ 31: జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి దేవుజా, డీఎస్పీ బి.సైదా నాయక్ వేర్వేరుగా బుధవారం నాడు విజయక్రాంతి పత్రిక క్యాలెండరు ఆవిష్కరణ చేశా రు. పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దేవుజా చేతుల మీదుగా క్యాలెండర్ ను ప్రముఖ న్యాయవాది ఇస్మాలప్పతో కలిసి ఆవిష్కరణ చేశారు. అలాగే డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సైదానాయక్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, విజయక్రాంతి విలేకరి పాల్గొన్నారు.