19-11-2025 05:05:32 PM
జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి..
నేరడిగొండ (విజయక్రాంతి): మండలంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలను పొగాకు రహిత పాఠశాలగా గుర్తించడం జరిగిందని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడకం మూలంగా కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, కొనిపించడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమం DAM గీతేష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.