calender_icon.png 2 June, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యుత్తమ సేవలతోనే ప్రజల్లో గుర్తింపు

31-05-2025 08:21:42 PM

కరీంనగర్ సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీ లక్ష్మణ్ కుమార్..

కరీంనగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు అత్యుత్తమ సేవలు అందించినప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ సమాచార, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి లక్ష్మణ్ కుమార్(Public Relations Department Assistant Director G Laxman Kumar) పేర్కొన్నారు. ఇందుకు గత 36 సంవత్సరాలుగా పలుచోట్ల పనిచేసి అటు అధికారులు ఇటు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకొని పదవి విరమణ పొందిన రాజకుమార్ నిదర్శనమని తెలిపారు. 

కరీంనగర్ సమాచార, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దామ రాజ్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సమాచార శాఖలో పని చేయడం ఒక గొప్ప అదృష్టమని, ఈ శాఖలో పని చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తే భాగ్యం కలుగుతుందన్నారు.

జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్ కరీంనగర్ కార్యాలయంలో వృత్తి నిబద్ధతతో అంకితభావంతో విధులు నిర్వర్తించారని, అటు అధికారులు ఇటు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా తన పని తాను చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఇలా నిబద్ధతతో విధులు నిర్వర్తించేవారు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఉద్యోగం పట్ల అంకితభావంతో పనిచేసిన రాజకుమార్ ఇకపై కుటుంబ సభ్యులతో మెదులుతూ ప్రశాంతమైన జీవనం సాగించాలని లక్ష్మణ్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, అధికారులు, సిబ్బంది రిటైర్డ్ అధికారులు, బంధుమిత్రులు రాజ్ కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు.

శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజకుమార్ తో ఉన్న అనుబంధము, ఆత్మీయతను పలువురు అధికారులు, ఉద్యోగులు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జేఆర్ఈ ఉషారాణి, రిటైర్డ్ సీఐ ఏ సత్యనారాయణ డిప్యూటీ ఇంజనీర్ నర్సింగ్ రావు సమాచార శాఖ రిటైర్డ్ అధికారులు పూర్ణచందరు, కనకయ్య, భూమయ్య శంకరయ్య చంద్రయ్య, కరీంనగర్ కార్యాలయ సిబ్బంది శ్రీధర్ శివాని పీ చిట్టమ్మ,ఆయేషా జగన్ బండారి భూమేష్ శ్రీనివాస్ తిరుపతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.