25 March, 2026 | 1:16 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

సందరీకరణ పనులు చేపట్టాలి

01-12-2024 12:53 AM

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, నవంబర్ 30 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని చారిత్రాక ప్రదేశాల్లో సుందరీకరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

శనివారం పట్టణంలోని ధర్మసాగర్ చెరువు, నిర్మల్ కోటలు, శ్యాం ఘాడ్ ప్రాంతంలో చేపట్టే పనులపై అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఫుట్‌పాత్ విస్తరణ, విద్యుదీపాల అలంకరణ, కోటల సుందరీకరణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ వెంట అధికారులు అశోక్ కుమార్, హరిభూషణ్, రాజు ఉన్నారు.