24 April, 2026 | 11:40 AM

Breaking News

సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •   అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం   •   పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'   •   మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి   •  

రికార్డు స్థాయిలో అత్యధిక బొగ్గు రవాణా

25-03-2025 05:27 PM

ఏరియా జిఎం శాలెం రాజు....

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఒక్క రోజుకు గాను 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో, సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని, రైలు మార్గం ద్వారా 14 రేకుల బొగ్గు రవాణ, (10 రేకులు జే.వి.ఆర్.సి హెచ్.పి నుండి, మిగిలిన 04 రేకులు ఆర్.సి హెచ్.పి నుండి రవాణా) చేయడం జరిగిందాని కొత్తగూడం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో భాగంగా జేవిఆర్ఓసి-2 నుండి గత సంవత్సరం సాధించిన 110.68 లక్షల టన్నుల కంటే 110.95 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన 138 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 152.85 లక్షల టన్నుల రవాణాను అధిగమించామన్నారు. ఈ రికార్డును నెలకొల్పటంలో యూనియన్ ప్రతినిధులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.