06-06-2025 12:07:53 AM
కామారెడ్డి, జూన్ 05,(విజయ క్రాంతి) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగువాన్ గురువారం కామారెడ్డి మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వారి సిబ్బంది సమక్షంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తూ జ్యూట్ బ్యాగ్స్ వాడాలని తెలియజేస్తూ మార్కెట్ యార్డ్ లో కూరగాయలు కొనడానికి వచ్చిన ప్రజలకు జ్యూట్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమo జిల్లా సైన్స్ అధికారి, నేషనల్ గ్రీన్ క్రాప్ స్ కన్వీనర్ సిద్ధిరాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు .