calender_icon.png 8 August, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర నిధులను విడుదల చేయండి

07-08-2025 11:50:24 PM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సహాయం తక్షణం విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేకు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(Minister Adluri Laxman Kumar) విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రాందాస్ అథవాలేను మంత్రి లక్ష్మణ్‌కుమార్ కలిసి రాష్ట్రంలోని సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పీసీఆర్/పీవోఏ చట్టాల అమలుకు రూ. 232.68 కోట్లు, పీఎం- పథకం కింద 2025 సంవత్సరానికి రూ.82.20 కోట్లను కేంద్రం నుంచి విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రం తన వాటాను చెల్లించిందని, కేంద్ర వాటా ఇప్పటివరకు రిలీజ్ కాలేదని తెలిపారు. ఈ నిధులే విడుదల చేస్తే ఎస్సీ వర్గాల న్యాయం, సాధికారత, అభివృద్ధి మరింత బలోపేతం అవుతుందన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో యంగ్ ఇండియా పథకం ప్రారంభించినట్టు వివరించారు. 

650 అద్దె భవనాల్లో

రాష్ట్రంలో 1,023 రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో సుమారు 650 అద్దె భవనాల్లో పని చేస్తున్నాయని, ఇది విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. ఇప్పటివరకు 55 శాతం వైఐఐఆర్‌ఎస్ ప్రాజెక్టులకు రూ.200 కోట్ల వ్యయంతో పనులు మంజూరయ్యాయని, ఈ పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తాయని మంత్రి తెలిపారు. ఈ యోజనను విజయవంతం చేయడానికి కేంద్రం నుండి ఆర్థిక సహాయం అత్యంత అవసరమని పేర్కొన్నారు.