11-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మాజీమంత్రి హరీశ్రావుకు హైకోర్టులో ఊర ట లభించింది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టివే సింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్రావు సరై న వివరాలు ఇవ్వలేదని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పేర్కొంటూ గతంలో చక్రధర్గౌడ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని అందులో ఆరోపించారు.
ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యా యస్థానం పిటిషన్లో సరైన ఆధారాలు లేవ ని కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి హరీశ్రావు, కాంగ్రెస్ నుంచి హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్గౌడ్ పోటీ చేశారు.
అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన హరీశ్రావు అఫిడవిట్లో పూర్తి సమాచారం వెల్లడించకుండా రహస్యం గా ఉంచారని చక్రధర్గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కుమారుడి వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదని పేర్కొన్నారు. విచా రణ జరిపిన హైకోర్టు సరైన ఆధారాలు లేవని పిటిషన్ను డిస్మిస్ చేసింది.
అక్రమ కేసులకు భయపడేది లేదు..
కోర్టు తీర్పు అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ..ఇప్పటికైనా ప్రతిపక్షనాయకులపై కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నయవంచనను ఎండగడుతామని హెచ్చరించారు.