13 April, 2026 | 1:32 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ఇసుక డంపు పట్టివేత

01-05-2024 12:32 AM

మంథని తహసీల్దార్ కార్యాలయానికి తరలింపు

‘విజయక్రాంతి’ కథనానికి స్పందన

మంథని, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు  పట్టుకున్నారు. గత నెల 26న విజయక్రాంతి పత్రికలో ‘ఇసుక దందా.. ఆపేదుందా’ కథనం ప్రచురితం కాగా మంథనిలో ఇసుక దందాపై పోలీస్, రెవెన్యూ అధికారులు నిఘా పెట్టారు. మంథని మండలంలోని మల్లేపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన దాదాపు 20 ట్రిప్పుల ఇసుక డంపును మంగళవారం గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్‌ఐ రాజిరెడ్డి.. సిబ్బందితో ఇసుక డంపు వద్దకు వెళ్లి పంచానామా చేశారు. ఇసుకను సీజ్ చేసి మంథని తహసీల్దార్ కార్యాలయనికి తరలించారు. మంథని డివిజన్‌లో ఇసుక అక్రమ రవాణా చేస్తే ప్రజలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆర్‌ఐ కోరారు.