వర్సిటీలను కేసీఆర్ పట్టించుకోలేదు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లలేదని, విద్యార్థుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. వేసవిలో యూనివర్సిటీల్లోని విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఇక్కడే ఉంటున్నారని, వారికి మెస్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో హాస్టళ్లను మూసివేయాలని సర్క్యూలర్ ఇ చ్చారని బల్మూరి వెంకట్ గుర్తుచేశారు. బాల్క సుమన్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీల్లోని సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమేనా? అని ఆయ న సవాల్ విసిరారు. ఏ సమస్య వచ్చినా సీఎం రేవంత్రెడ్డి, మం త్రులు వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు.




