23 March, 2026 | 3:24 PM

Breaking News

ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •  

కామారెడ్డి జిల్లాలో ఓ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన రిపోర్టర్

24-04-2025 11:13 PM

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రిపోర్టర్ పై కేసు నమోదు..

కామారెడ్డి (విజయక్రాంతి): ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఓ విలేకరిపై కేసు నమోదు అయిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే తన అరాచకాలను బయటపెడతానని తన వద్ద ప్రూఫ్స్ ఉన్నాయని డబ్బులు ఇస్తే వాటిని ప్రసారం చేయనని డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు విలేకరిపై ఎమ్మెల్యే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న ఛానల్ లో పనిచేస్తున్న ఓ రిపోర్టర్ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ కు పాల్పడడంతో ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశారని కలకలం రేపుతుంది.