7 July, 2026 | 2:56 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

24-06-2025 12:30 AM

మేడ్చల్, జూన్ 23(విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్ కాకతీయ నగర్ నార్త్ లో గల స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. నీటి కొర త ఉన్నందున బోరు వేయించాలని, స్నానా ల గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని, వృద్ధులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే కాలనీలో డ్రైనేజీ పొంగుతోందని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకీకరించాలని వారు కోరారు. ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు పరిస్థితిని తెలియజేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాకతీయ నగర్ వాసులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, కొమురయ్య, వెంకటాచారి, సత్యనారాయణ, అజయ్ తదితరులున్నారు.