24-06-2025 12:30:08 AM
మేడ్చల్, జూన్ 23(విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్ కాకతీయ నగర్ నార్త్ లో గల స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. నీటి కొర త ఉన్నందున బోరు వేయించాలని, స్నానా ల గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని, వృద్ధులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే కాలనీలో డ్రైనేజీ పొంగుతోందని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకీకరించాలని వారు కోరారు. ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు పరిస్థితిని తెలియజేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాకతీయ నగర్ వాసులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, కొమురయ్య, వెంకటాచారి, సత్యనారాయణ, అజయ్ తదితరులున్నారు.