30-09-2025 12:15:05 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 29 : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుం డా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నా యక్, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి స మస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించా ల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ రోజు ప్రజావాణికి మొత్తం 21 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరె న్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.