calender_icon.png 6 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి కృషి విజయవంతం కావాలి

06-12-2025 12:19:04 AM

  1. రాష్ట్రాభివృద్ధికి సీఎం కష్టపడుతున్నారు
  2. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ  
  3. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుపై సీఎంకు లేఖ    

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమికి పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంపై సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధ్దికి సబంధించిన ప లు కీలక , ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి, ఈ సమ్మిట్ ఒక వేదికగా అందిస్తుందని ఆమె తెలిపారు.

అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ వ్యవసాయాభివృద్ది ప్రాజెక్టుకు సమ ప్రాధాన్యత ఇస్తూ మూడెంచల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియాగాంధీ రాసిన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజన వనరులు, ప్రజల వ్యాపారా నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధ్దికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందన్నాఉరు, సమ్మి ట్‌లో పాల్గొనే వారందరికి సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు.