16 March, 2026 | 11:34 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్టుకు రావాలి

31-10-2024 01:43 AM

మాకు చెప్పకుండా ఆస్పత్రికి వెళ్తే ఎలా? : పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయ క్రాం తి): సీఎం రేవంత్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసిడ్రగ్స్ టెస్టుకు రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన పంచాయతీ అనిల్‌కుమార్‌తో కాదని, రేవంత్‌రెడ్డితోనేన ని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి డ్రగ్స్ టెస్టుకు రావాలని తాను సవాల్ విసిరానని, కానీ తనకు చెప్పకుండా వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కేటీఆర్ పై కూడా విఫలమయ్యారని విమర్శించారు.