6 May, 2026 | 8:13 PM

Breaking News

శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •  

గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి

06-05-2026 07:37 PM

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..

ఉట్నూర్,(విజయక్రాంతి): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ పరిధిలోని గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. బుధవారం కొమురం భీం కాంప్లెక్స్‌లోని పిఎంఆర్సిలో గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన సహకార సంస్థ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న సహకార సంస్థ కార్యక్రమాలు లక్ష్యాలను  సాధించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

గిరిజనుల జీవనోపాధి మెరుగుపరిచే దిశగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్సే కరణ, కొనుగోలు, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో పారదర్శకత పాటించాలని, గిరిజనులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా నివారించాలని తెలిపారు. గిరిజన సహకార సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు ప్రతి గ్రామానికి చేరేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరించాలని తెలిపారు.

వన ఉత్పత్తుల విలువ, ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని తెలిపారు. సమీక్షలో భాగంగా అధికారులు తమ పరిధిలో చేపట్టిన పనుల పురోగతిని వివరించి, పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకురాగా ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం, అలసత్వం వహించే అధికారులపై చర్యలు  తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.