12 June, 2026 | 2:21 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

వాగులో గల్లంతైన వ్యక్తిని కాపాడిన యువకులు

30-10-2025 12:36 AM

తాండూరు, 29 అక్టోబర్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నానది వాగులో ఓ వ్యక్తి  గల్లంతైన విషయాన్ని గమనించిన గ్రామస్తులు చాకచక్యంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు .తాండూరు మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నానదిలో కొట్టుకుంటూ వచ్చాడు.

వీర్ శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి.. మునుగుతూ.. తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వర్షపు నీరు ఉధృతికి దూరం పెరుగుతుండడంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి వాగులోకి తాడు విసిరి.. నర్సయ్యను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం అందించి తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.గ్రామ యువకులు చేసిన సాహసానికి గ్రామస్తులు అభినందించారు.