14 April, 2026 | 5:23 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

వాగులో గల్లంతైన వ్యక్తిని కాపాడిన యువకులు

30-10-2025 12:36 AM

తాండూరు, 29 అక్టోబర్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నానది వాగులో ఓ వ్యక్తి  గల్లంతైన విషయాన్ని గమనించిన గ్రామస్తులు చాకచక్యంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు .తాండూరు మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నానదిలో కొట్టుకుంటూ వచ్చాడు.

వీర్ శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి.. మునుగుతూ.. తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వర్షపు నీరు ఉధృతికి దూరం పెరుగుతుండడంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి వాగులోకి తాడు విసిరి.. నర్సయ్యను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం అందించి తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.గ్రామ యువకులు చేసిన సాహసానికి గ్రామస్తులు అభినందించారు.