calender_icon.png 9 June, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య

09-06-2025 12:35:26 PM

చేగుంట, విజయక్రాంతి: అప్పుల బాధ భరించలేక ఆర్ఎంపి వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట పోలీస్ స్టేషన్(Chegunta Police Station) పరిధిలోని మాసాయిపేట్ మండల్  పోతనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బర్రె మహేష్ (30) గత కొంతకాలం నుండి తూప్రాన్ మండల్  మల్కాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుండి  తెలిసిన వారి నుండి, చుట్టాలు,స్నేహితుల, దగ్గర సుమారు 13, లక్షల మేరకు తప్పు చేశాడు. అప్పు తీర్చలేక, వేరే మార్గం లేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు త్రాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మెరిగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.