09-06-2025 01:28:55 PM
న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: మాజీ మంత్రి హరీష్ రావు
తన నివాసం నుంచి కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు బయలుదేరిన మాజీ మంత్రి
రాజేంద్రనగర్: కాలేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము ప్రభుత్వంలో లేమని తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు, బీఆర్ఎస్ పార్టీకి అపారమైన నమ్మకం ఉందని, అందుకే కమిషన్ ముందు హాజరు అవుతున్నాం.. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని చెప్పారు. ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడద, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాల రాయద్దని కోరారు. అంతిమంగా న్యాయం గెలుస్తది.. న్యాయం మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు తెలియజేశారు.