calender_icon.png 21 June, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో రోడ్డు ప్రమాదం

18-03-2025 12:06:05 AM

  1. ముగ్గురు తెలంగాణవాసుల మృతి
  2. మృతుల్లో తల్లి, కుమారుడు, అత్త

రంగారెడ్డి, మార్చి 17 (విజయక్రాంతి): అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లి గ్రామానికి చెం దిన ముగ్గురు మృతిచెందారు. రంగారెడ్డి జి ల్లా టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి దంపతులకు ఇద్దరు కు మార్తెలు.

చిన్న కుమార్తె ప్రగతిరెడ్డి(35)ని సి ద్దిపేట జిల్లా బక్రిచెప్యాలకు చెందిన రోహిత్‌రెడ్డితో పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కు మారులు ఉన్నారు. వీరంతా ఉద్యోగ రీత్యా గత 13 ఏళ్లుగా ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు. సోమవారం కుటుంబ సభ్యులంతా కారులో ప్రయాణిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది.

ఈ ప్ర  ప్రగతిరెడ్డి(35), ఆమె కుమారు డు అర్విన్(6), అత్త సునీత(56) అక్కడి  మృతిచెందారు. రోహిన్‌రెడ్డి, మరో కు  తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి మృ తితో టేకులపల్లిలో విషాదఛాయలు అ లుముకొన్నాయి. అంత్యక్రియలు ఫ్లోరిడాలోనే నిర్వహించనుండటంతో మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు వెళ్లారు.