calender_icon.png 20 June, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేత్రా దానం చేసిన తాతా, మనుమడు

18-03-2025 12:06:03 AM

కారు బస్సు ఢీకొని తాత మనువడు మృతి కన్నీళ్లతోనే మృతుల కండ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు 

మహబూబ్ నగర్ మార్చి 17 (విజయ క్రాంతి) : తాతా మనవడు ఒకేసారి కళ్ళను దానం  చేసి మరో నలుగురికి కంటి చూపును ప్రసాదించిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. జడ్చర్ల సమీపంలోని మాచర్ల దగ్గర బస్సు, కారు ఢీ కొనడం జరిగింది.

కారులో ఉన్న తాతమనవడు అక్కడికక్కడే మహబూబ్ నగర్  న్యూ ప్రేమ్ నగర్ కు  చెందిన తాతా మనవడు ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నా సమయంలో జడ్చర్ల సమీపంలోని మాచర్ల వద్ద కారు బస్సు  ఢీకొన్న ఘటనలో కారులో ఉన్నటువంటి తాతా  మాదిరెడ్డి వెంకటరెడ్డి (69) మనుమడు  సామ మీ దయ అర్జిత్ రెడ్డి  (తున్ను) (22) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటనలో మరణించినటువంటి వారి కళ్ళు ఇతరులకు కంటి చూపు అందించాలని, కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో, పెద్ద మనసుతో, వారు ఇంకొక నలుగురికి కంటి చూపు అందించాలని  కండ్లు (కార్నియా) దానం చేయడం జరిగింది. లయన్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి సహాయంతో, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ యొక్క టెక్నీషియన్ అయినా శివను పిలిపించి  కంటి శుక్లాలు (రెటీనా) సేకరించడం జరిగింది.

ఈ సందర్భంగా లయన్ నటరాజు మాట్లాడుతూ నేత్ర దానం చేసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులకు కార్నియా సేకరించినట్లు టెక్నిషియన్  శివ ధృవ పత్రాలను అందజేశారు. ఇప్పటి వరకు  మహబూబ్ నగర్ పట్టణం లో 225 మంది నుంచి రెటీనా ను సేకరించినట్లు తెలిపారు. మరణానంతరం ఇతరులకు కంటి చూపును ఇచ్చిన వారమవుతామని అన్నారు.  నేత్ర దానం చేసేందుకు 9666900900 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.