కారును ఢీకొట్టిన ట్రక్కు.. ముగ్గురు మృతి
రాజస్థాన్లోని దౌసాలో ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన గుజరాత్కు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా ఆవు వచ్చింది. ఆ తర్వాత వారు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, రోడ్డుపై నిలబడి ఉండగా, వెనుక నుండి ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బండికుయ్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబంతో సహా అహ్మదాబాద్ నుండి ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు వెళ్తుండగా దౌసాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగిందని డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి జవాన్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. "మా అమ్మ అంతిమ కర్మలు చేయడానికి మేము హరిద్వార్కు బయలుదేరాము. వెనుక నుండి ఒక ట్రక్కు మమ్మల్ని ఢీకొట్టింది, మా సోదరుడు, మా కోడలు, మా మామ మృతి చెందారు. నా సోదరి, నా మేనకోడలు పరిస్థితి విషమంగా ఉంది" అని కుటుంబ సభ్యుల్లో ఒకరు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను బండికుయ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.






