12 March, 2026 | 8:25 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్‌ : ఎంవీఐ మోహన్

20-01-2026 12:25 PM

వాంకిడి,(విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని ఆటో స్టాండ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మోహన్ ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

ఎంవీఐ మోహన్ మాట్లాడుతూ.... ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, జాతీయ రహదారులపై ఆటోల ప్రయాణానికి విధించిన నిషేధాన్ని గుర్తుంచుకొని వాహనాలు నడపాలని తెలిపారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, సరైన కండిషన్‌లో లేని వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని సూచించారు. వాహనాలను నిర్ధారిత స్థలాల్లోనే పార్క్ చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చ ని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు రాజమల్లు, సంజ య్, రాజశేఖర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.