calender_icon.png 8 June, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

07-06-2025 09:10:50 PM

ఆర్ అండ్ బి సీఈ మోహన్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి సీఈ మోహన్ నాయక్(R&B CE Mohan Naik) అధికారులను ఆదేశించారు. శనివారం కేసముద్రం పట్టణంలోని పలురోడ్ల విస్తరణ పనులను  పరిశీలించారు. వివిధ చోట్ల నిర్మించనున్న బ్రిడ్జిల పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈ మోహన్ నాయక్ మాట్లాడుతూ... కేసముద్రం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా కోట్ల రూపాయలతో చేపడుతున్న పనుల్లో జాప్యం చేయకుండా, పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీ ఈ వెంట ఎస్ ఈ రాఘవరెడ్డి, ఈ ఈ బీమ్లా, డీఈ శ్రీకాంత్ , ఏఈ లు సందీప్, మహేష్ ఉన్నారు.