calender_icon.png 8 June, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటూరు మదర్ డెయిరీ చైర్మన్ గా సైదులు ఏకగ్రీవం

07-06-2025 09:08:58 PM

నాగారం: నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్(MLA Mandula Samuel), ఆశీర్వాదంతో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ చింతారెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారంతో మదర్ డెయిరీ చైర్మన్ గా బూర్గుల ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. శనివారం మదర్ డైయిరీ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

నూతన ఛైర్మెన్ గా ఎన్నికైన బూర్గుల సైదులు మాట్లాడుతూ... నా ఎన్నికకు సహకరించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, చింతారెడ్డి రాజాగోపాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లుగా కొమ్ము సునీత, వంగూరి సంజీవ, తీగుళ్ళ యాదగిరి, బుంగ ఇమ్మి, కొమ్ము లింగుస్వామి, కన్నెబొయిన రాములు, గుండు సతయ్య, కన్నెబొయిన మహేష్,  కొరివి ఉపేందర్ లు ఎన్నికయ్యారు.ఈకార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పేరాల పూలమ్మ, మాజీ ఉపసర్పంచ్ పేరాల వెంకన్న, మాజీ చెర్మెన్ తీగుళ్ళ వెంకన్న, వంగూరి నాగార్జున, కన్నెబొయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు.